రాహుల్‌ను ప్రధాని చేయండి: సీఎం సిద్ధరామయ్య

Update: 2024-04-06 17:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోడీని గద్దె దించి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున కోలార్‌లో శనివారం నిర్వహించిన రోడ్ షోలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధిరాకంలోకి రాగానే కర్ణాటకలో మాదిరిగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలంతా అర్థం చేసుకుని కాంగ్రెస్‌కు ఓటేసి, అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ‘‘మీ అందరికీ నమస్కరించి అడుగుతున్నా.. దయచేసి మోడీని గద్దె దించి, రాహుల్‌ను ప్రధానిని చేయండి’’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బీజేపీ అబద్ధాలకు మోసపోకండి

బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ అని, ఓటమి భయంతో ఆ పార్టీ చెప్పే అబద్ధాలకు మోసపోవద్దని ప్రజలను సిద్ధరామయ్య కోరారు. మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్, వంట నూనె, సిలిండర్లు, ఎరువులు, పప్పులు, కూరగాయల ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కష్టాల నుంచి రాష్ట్ర ప్రజలను గట్టెక్కించేందుకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము కీలకమైన హామీలు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఉద్ఘాటించారు.



Tags:    

Similar News