తెలంగాణకు ఎన్నికల ఇన్చార్జిని నియమించిన BJP
ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్చార్జిగా అభయ్ పాటిల్ను నియమించింది.
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్చార్జిగా అభయ్ పాటిల్ను నియమించింది. తెలంగాణతో పాటు మొత్తం 13 రాష్ట్రాలకు ఇన్చార్జి, సహా ఇన్చార్జులను నియమించింది. ఈ మేరకు బుధవారం రాత్రి బీజేపీ కేంద్ర కార్యాలయం అధికార ప్రకటన విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ పూర్తి జాబితా...
1. కిషన్ రెడ్డి- సికింద్రాబాద్
2. బండి సంజయ్- కరీంనగర్
3. ధర్మపురి అర్వింద్- నిజామబాద్
4. ఈటల రాజేందర్- మల్కాజ్ గిరి
5. పోతుగంటి భరత్- నాగర్ కర్నూల్ (ఎస్సీ)
6. బూర నర్సయ్య గౌడ్- భువనగిరి
7. కొండా విశ్వేశ్వర్ రెడ్డి- చేవెళ్ల
8. బీబీ పాటిల్- జహీరాబాద్
9. డాక్టర్ మాధవీలత- హైదరాబాద్
10. గోడం నగేశ్- ఆదిలాబాద్ (ఎస్టీ)
11. డీకే అరుణ- మహబూబ్ నగర్
12. సీతారాం నాయక్- మహబూబాబాద్
13. గోమాస శ్రీనివాస్- పెద్దపల్లి
14. రఘునందన్ రావు- మెదక్
15. శానం సైదిరెడ్డి- నల్గొండ
16. ఆరూరి రమేశ్- వరంగల్ (ఎస్సీ)
17. తాండ్ర వినోద్ రావు- ఖమ్మం