ప్రేమ వ్యవహారమే హత్యకు దారి..కేసును ఛేదించిన బేగంపేట పోలీసులు

ఉస్మాన్ హత్య కి ప్రేమ వ్యవహారమే కారణం అని ఉత్తర

Update: 2024-06-26 14:22 GMT

దిశ,కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: ఉస్మాన్ హత్య కి ప్రేమ వ్యవహారమే కారణం అని ఉత్తర మండలం పోలీసులు తేల్చారు. బుధవారం బుధవారం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సాధన రేష్మి పెరుమాళ్ కేసు వివరాలను వెల్లడించారు. బేగం పేట పాటిగడ్డ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ ,అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు.తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఉస్మాన్ అడ్డుకుంటున్నాడు.అదేవిధంగా తనను నేనే పెళ్లి చేసుకుంటానని వారిని కోరిన అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. కాగా మంగళవారం ఉస్మాన్ విషయం లో ఇరువురి కుటుంబాల మధ్య గొడవ జరిగింది.

మంగళవారం సాయంత్రం బేగంపేట పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కాగా ఉస్మాన్ పెళ్లి సంబంధాలు చెడగొడుతుండడం తో అమ్మాయి బావ ఇజాజ్ అతనిపై కోపం పెంచుకున్నాడు. తన మరదలకు ఉస్మాన్ వల్ల పెళ్లి సంబంధాలు చెడిపోతున్నాయని, దీంతో ఆతన్ని అంతమొందించాలని నిర్ణయం తీసుకున్నాడు. అదే రోజు రాత్రి ఉస్మాన్ కోసం ఇజాజ్ కాపు కాసి, బైక్ పై వస్తున్న ఉస్మాన్ ను ఆపి, కత్తి తో పొడిచి అడ్డగించాడు. ఉస్మాన్ కింద పడడంతో గొంతు కోశాడు. ఈ ఘటనలో ఉస్మాన్ తీవ్ర గాయాలపాలై అక్కడికి అక్కడే ప్రాణాలు కొల్పోయాడు.అనంతరం ఇజాజ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఉస్మాన్ హత్యకు సహకరించిన ఫిరోజ్ ఖాన్, సాహిల్, రహిన్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో బేగంపేట ఎ సి పి గోపాల కృష్ణ మూర్తి, ఇన్స్పెక్టర్ రామయ్య, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News