హైదరాబాద్‌లో వరుస హత్యల కలకలం!.. సింగిల్ డే.. డబుల్ మర్డర్స్

హైదరాబాద్ లో ఒకే రోజు రెండు దారుణ హత్యలు జరగగా.. ఈ రెండింటికి ప్రేమ వ్యవహారమే కారణం కావడం గమనార్హం.

Update: 2024-06-29 12:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో ఒకే రోజు రెండు దారుణ హత్యలు జరగగా.. ఈ రెండింటికి ప్రేమ వ్యవహారమే కారణం కావడం గమనార్హం. వరుస హత్యలతో నగరంలోని ప్రజలు భయాందోలనకు గురి అవుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగిలో ఇంజినీర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గంధంగూడలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. గోల్కొండ ప్రాంతానికి ఇజాయత్‌ అలీ అనే ఇంజనీర్‌ను దుండగులు గొంతుకోసి అతి దారుణంగా చంపారు. పోలీసుల వివరాల ప్రకారం దుబాయ్ లో ఇంజనీర్ గా పని చేస్తున్న ఇజాయత్ అలీ 20 రోజుల క్రితం ఇండియాకు తిరిగి వచ్చాడు.

తనకు పరిచయం ఉన్న ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి అతడిని క్వాలీస్ కారులో నార్సింగి పరిధిలోని మంచిరేవుల గ్రీన్ ల్యాండ్స్ వెంచర్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి, అక్కడే కత్తితో గొంతుకోసి హతమార్చారు. అనంతరం క్వాలిస్‌ వాహనాన్ని హత్య స్థలంలోనే వదిలేసి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలంలో క్వాలిస్‌ వాహనంతో పాటు 2 ఫోన్లు దొరికాయని, వాటిని సీజ్ చేశామని, క్లూస్ టీం మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణం అయ్యి ఉండొచ్చని, అలీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే దానిపై ధర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. అల్లాపూర్ ప్రాంతంలో అమ్మాయి కోసం ఓ బాలుడు మరో 10 మంది ఇంటర్ విద్యార్థులతో కలిసి తన స్నేహితుడినే హత్య చేశాడు. ఘటన ప్రకారం తాను ప్రేమించిన అమ్మాయిని ఇష్టపడుతున్నాడనే కారణంతో డానిష్ అనే బాలుడిని తీసుకెళ్లి మరో 10 మంది మైనర్లతో కలిసి చంపారు. బాలుడిని బీరు సీసాలతో తలపై కొట్టి, గొంతు నులిమి అతి దారుణంగా హత్య గావించారు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసిన మైనర్లు.. మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పై పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Similar News