Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు..

Update: 2024-07-01 16:13 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. విభజన సమస్యలపై చర్చించేందుకు ముఖాముఖి భేటీ కావాలని లేఖలో పేర్కొన్నారు. 6న హైదరాబాద్‌లో కలుసుకోవాలని చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా చాలా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఒకసారి కలిసి మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతికి పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. ఉమ్మడి అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని  తెలిపారు. ఈ మేరకు ఇద్దరం కలుద్దామని రేవంత్ రెడ్డికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 

కాగా ఏపీ విభజన సమస్యలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉండటంతో ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌ వేదికగా కసరత్తులు ప్రారంభించారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కలుద్దామని లేఖ రాశారు. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

Similar News