AP:తొమ్మిది నెలల్లో దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది: డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో వారాహి సభలో పాల్గొన్నారు.

Update: 2024-07-03 15:08 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో వారాహి సభలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ 9 నెలలుగా ఓ యువతి మిస్సైతే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. దీంతో ఆ యువతి తల్లి తనకు ఫిర్యాదు చేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. భీమవరానికి చెందిన యువతి తొమ్మిది నెలలుగా దొరకలేదని, కానీ తమ పాలనలో 9 రోజుల్లోనే కేసును ఛేదించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం మహిళల మిస్సింగ్‌పై నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వైసీపీ ప్రభుత్వం పై యువత, ప్రజలు విసిగిపోయారని అన్నారు.రక్తం చిందించకుండా అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టారు అని ఆయన వ్యాఖ్యానించారు.


Similar News