Ap News: బాలికపై గ్యాంగ్ రేప్.. రిమాండ్కు ఐదుగురు యువకులు
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు..
దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతిపై గంజాయి బ్యాచ్ అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే అదే జిల్లాలో మరో దారుణం జరిగింది. బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజాంపట్నం మండలంలో జరిగింది. వేమూరుకు చెందిన బాలిక ఇటీవల అమ్మమ్మగారి గ్రామం గరువుపాలేనికి వెళ్లారు. అయితే బాలికకు అదే గ్రామానికి చెందిన యువకులు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో మాట్లాడుకుందా రా అని సాయంత్రం సమయంలో గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అనంతరం బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రి 10 గంటలకు బాలిక ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో బాలిక అసలు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.