టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నిర్వహణకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-07-01 15:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నిర్వహణకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు కసరత్తు చేస్తున్న క్రమంలో క్యాబినెట్ ముందుకు టెట్ ను కూడా నిర్వహించాలని వాదనలు వచ్చాయి. ఈ క్రమంలో నూతన మంత్రి మండలి మెగా డీఎస్సీ తో పాటు టెట్ నిర్వహణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూలై 1 సోమవారం సాయంత్రం టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపటి నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా ఈ టెట్ లో అర్హత సాధించిన వారికి డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. కాగా పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://aptet.apcfss.in/# ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. 

Similar News