AP Elections 2024: పార్టీ ఏజెంట్లు కిడ్నాప్.. ఆ నియోజకవర్గంలో ఉద్రిక్తత

by Indraja |
AP Elections 2024: పార్టీ ఏజెంట్లు కిడ్నాప్.. ఆ నియోజకవర్గంలో ఉద్రిక్తత
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా సాగాల్సిన ఎన్నికలను వైసీపీ నాయకులు హింసాత్మకంగా మారుస్తున్నారు. దీనితో కొన్నిచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా, పుంగనూరులో వైసీపీ నాయకులు దురాగతాలకు హద్దుఅదుపు లేకుండా పోతోందని ప్రతిపక్ష నేతలతోపాటుగా స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు.

పోలింగ్ కేంద్రాల టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఏజెంట్లు రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర సదుం మండలం బూరుగమందలో 188, 189, 190 కేంద్రాల బయలుదేరారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న టీడీపీ ఏజెంట్లను పెద్దిరెడ్డి మనుషులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. దీనితో ఆ నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story