డ్రైనేజీ క్లీన్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ MP అభ్యర్థి

by Disha Web Desk 2 |
డ్రైనేజీ క్లీన్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ MP అభ్యర్థి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరు బట్టలు ఐరన్ చేస్తున్నారు. మరొకరు దోసలు వేస్తున్నారు. ఇంకొకరు ఏకంగా చిన్నారులకు స్నానాలు చేయిస్తున్నారు. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఏకంగా డ్రైనేజీ క్లీన్ చేశారు. ఈ ఘటన భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం జిల్లాలోని ఆలేరులో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరులో పారిశుధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీ క్లీన్ చేశారు. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరుగాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్‌, బీజేపీలు తెలంగాణను నిండా ముంచాయని అన్నారు.




Next Story

Most Viewed