ఇది ఆరంభమే.. నా గోల్ అదే : లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్

by Harish |
ఇది ఆరంభమే.. నా గోల్ అదే : లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్
X

దిశ, స్పోర్ట్స్ : జాతీయ జట్టుకు ఆడటమే తన లక్ష్యమని లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ తెలిపాడు. మంగళవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లతో సత్తాటిన అతను లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మయాంక్ మాట్లాడుతూ..‘రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకోవడం ఆనందంగా ఉంది. మేము రెండు మ్యాచ్‌ల్లో గెలవడం ఇంకా సంతోషంగా ఉంది. భారత్ తరపున ఆడాలన్నదే నా లక్ష్యం. కాబట్టి, ఇది ప్రారంభం మాత్రమే. నా ప్రధాన లక్ష్యంపైనే దృష్టి ఉంటుంది.’ అని చెప్పుకొచ్చాడు. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై(155.8 కేపీహెచ్) ఈ సీజన్‌లోనే వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన అతను.. బెంగళూరుపై 156.7 కేపీహెచ్ స్పీడ్‌తో బంతి వేసి తన రికార్డును తానే అధిగమించాడు.

Advertisement

Next Story