IPL 2023: కోల్‌కతా చేతిలో ఓటమితో డేంజర్ జోన్‌లో ధోనీసేన..!

by Vinod kumar |
IPL 2023: కోల్‌కతా చేతిలో ఓటమితో డేంజర్ జోన్‌లో ధోనీసేన..!
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైకు మరో ఓటమి ఎదురైంది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో ధోని సేనను చిత్తు చేసింది. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడలేకపోయిన ధోనీ సేన ఓటమిపాలైంది. అయితే ఈ ఓటమి చెన్నై సూపర్ కింగ్స్‌ను డేంజర్ జోన్‌లో నిలబెట్టింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్న చెన్నై మే20న జరిగే చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాటు ఓ మ్యాచ్ రద్దవ్వడంతో 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు దగ్గరగా ఉన్న చెన్నై.. మరో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా టోర్నీలో ముందడుగు వేస్తోంది.

కానీ, చివరి మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడితే మాత్రం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోంటుంది. ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఢిల్లీ చేతిలో చెన్నై ఓడి.. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్ ఓడిపోవాలి. లేదంటే చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed