IPL 2023: మొదటి పంచ్ చాంపియన్లదే...

by Mahesh |
IPL 2023: మొదటి పంచ్ చాంపియన్లదే...
X

దిశ, వెబ్‌డెస్క్: IPL2023 16 ఎడిషన్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సీజన్‌లో జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్, చెన్నై మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ ఓడిన చెన్నె జట్టు బ్యాటింగ్‌కు దిగింది. చెన్నై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 92 తో చెలరేగడంతో చెన్నై 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టుకు గిల్, సహా.. మంచి ఆరంభాన్ని అందించారు. అలాగే విజయ్ శంకర్, రషిద్ ఖాన్, రాహు తెవతియ సరైన సమయంలో భారీ షాట్స్ కొట్టడంతో గుజరాత్ జట్టు ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది.

Advertisement

Next Story

Most Viewed