రాణించిన గుజరాత్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు భారీ స్కోర్

by Disha Web Desk 12 |
రాణించిన గుజరాత్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు భారీ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా ఈ రోజు 45 మ్యాచ్ గుజరాత్, ఆర్సీబీ జట్ల మధ్య జరుగుతుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోరు చేసింది. జీటీ బ్యాటర్లు సాయి సుదర్శన్ 84*, షారుఖ్ ఖాన్ 58, మిల్లర్ 26*, గిల్ 16 పరుగులు చేశారు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఈ మ్యాచులో ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, మ్యాక్స్ వెల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో బెంగళూరు జట్టు గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే 120 బంతుల్లో 201 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఈ భారీ స్కోరు ఆర్సీబీ చేజ్ చేసి.. పోటీలో నిలుస్తుందో లేదో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.



Next Story

Most Viewed