- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
భారత్ భారీ విజయం.. బంగ్లా చిత్తు
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8 రౌండ్లో వరుసగా రెండో విజయం సాధించింది. నార్త్ సౌండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ(37), పంత్(36), దూబె(34), రోహిత్(23) రాణించడంతో జట్టుకు భారీ స్కోరు దక్కింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. కెప్టెన్ శాంటో(40) టాప్ స్కోరర్గా నిలిచాడు. కుల్దీప్ స్పిన్ మంత్రానికి తోడు బుమ్రా, అర్ష్దీప్ సింగ్ చెలరేగడంతో బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ విజయంతో టీమ్ ఇండియాకు సెమీస్ బెర్త్ దాదాపు ఖరారైనట్టే.
Advertisement
Next Story