భారత్ భారీ విజయం.. బంగ్లా చిత్తు

by Harish |
భారత్ భారీ విజయం.. బంగ్లా చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌‌లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8 రౌండ్‌లో వరుసగా రెండో విజయం సాధించింది. నార్త్ సౌండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ(37), పంత్(36), దూబె(34), రోహిత్(23) రాణించడంతో జట్టుకు భారీ స్కోరు దక్కింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. కెప్టెన్ శాంటో(40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుల్దీప్ స్పిన్ మంత్రానికి తోడు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చెలరేగడంతో బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ విజయంతో టీమ్ ఇండియా‌కు సెమీస్ బెర్త్ దాదాపు ఖరారైనట్టే.

Advertisement

Next Story

Most Viewed