ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి

by Aamani |
ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి చెందిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ చౌరస్తాలో చోటుచేసుకుంది. యువతి రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. యువతిని బస్సు ఢీకొన్న సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు బయటకొచ్చాయి. అందులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపారని స్పష్టమవుతుంది. యువతి బస్సు చక్రాల కిందపడి ప్రాణాలు విడిచింది. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed