- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Gautam Buddha: నోయిడా యూనివర్సిటీ వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. హత్యకు అదే కారణమా..?
దిశ వెబ్ డెస్క్: నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలోని వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం లభ్యంకావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్లో ఓ మహిళ మృతదేహాం కనిపించింది. దీనితో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని వెలికితీసారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారి శివహరి మీనా మాట్లాడుతూ.. ఆ మహిళ తన అత్త, భర్తతో కలిసి క్వార్టర్స్ భవనంలోనే నివసిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అలానే ఆమె భర్త యూనివర్సిటీ సమీపంలోని జిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కాగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపినట్టు వెల్లడించారు. ఇక ఎప్పటిలానే ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. కాగా ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసిందని, ఈ నేపథ్యంలో అత్త, భర్త ఇద్దరు కలిసి ఆమెను హత్య చేసి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించినట్లు పేర్కొన్నారు.
కాగా మహిళ మృతిపై ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ధర్యప్తు చేపట్టినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపిన ఆయన.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు.