రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిజాంసాగర్ నుంచి జాతీయ రహదారికి గల ప్రధాన రహదారి పై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగిరెడ్డిపేట మండలం జప్తి జనకం పల్లి గ్రామానికి చెందిన లకావత్ సునీత (32) మహిళ మృతి చెందినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం సునీత భర్త దేవిచంద్, మరో వ్యక్తి శ్రీనివాస్ తో కలిసి ముగ్గురు ద్విచక్ర వాహనం పై పెద్ద కొడప్గల్ మండలం వడ్లం తండాలోని బంధువుల ఇంటి నుండి నిజాంసాగర్ వైపు ప్రయణిస్తున్నారు.

సరిగ్గా వడ్డేపల్లి గ్రామ శివారులో కంకర మిషన్ సమీపంలో రాగానే ఎదురుగా వస్తున్న ఓ లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సునీత సంఘటన స్థలంలో మృతిచెందగా దేవిచంద్, శ్రీనివాస్ వీరిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వీరిని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కే.సుధాకర్, బాన్సువాడ సీఐ రూరల్ సత్యనారాయణ సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. లారీ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని ఆయన అన్నారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.

Next Story