పూల కోసం వెళ్లి శవమై తేలాడు

by Sridhar Babu |
పూల కోసం వెళ్లి శవమై తేలాడు
X

దిశ,బెల్లంపల్లి : తామర పూల కోసం వెళ్లి ఓ రిటైర్డ్ కార్మికుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురువారం వెలుగు చూసింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి బస్తీకి చెందిన పోతరాజుల నరసయ్య (60) బుధవారం సాయంత్రం పూల కోసమని ఇంటి నుంచి పోచమ్మ చెరువుకు వెళ్లాడు. తామర పూల కోసం చెరువులో దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో చిక్కుకొని మునిగి పోయి మృతి చెందాడు. నరసయ్యకు భార్యా పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed