భార్య కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

by Disha Web Desk 23 |
భార్య కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
X

దిశ, కొత్తకోట: భార్య కొడుకు లేని జీవితం నాకెందుకు అంటూ కూరగాయల తిరుపతయ్య కుమారుడు ఎల్.కృష్ణ (40)అనే యువకుడు మనస్థాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ సంఘటన కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తకోట పట్టణానికి చెందిన కృష్ణకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదరాబాదులో హోటల్ మేనేజ్మెంట్ లో ఉద్యోగం చేస్తూ గత మూడు నెలల కిందట భార్య పిల్లలతో కలిసి సంతోషంగా కారులో షిరిడి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై భార్య కుమారుడు చనిపోగా కృష్ణకు స్వల్ప గాయలతో బయటపడ్డాడు.

భార్య కొడుకు మరణించడంతో కొన్ని రోజుల నుండి మనోవేదనకు గురై మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిపారు. ఉన్న ఒక్క కూతురు తల్లి తండ్రి లేని అనాధగా మిగిలిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పత్రికలో వార్తలు రావడంతో గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు ఇది హత్యనా.. ఆత్మహత్యనా.. అనే కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed