రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి, ఒకరికి తీవ్రగాయాలు..

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి, ఒకరికి తీవ్రగాయాలు..
X

దిశ, నిజాంసాగర్ : ఎన్ హెచ్ -161 జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో జరిగింది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నాగల్ గావ్ గ్రామానికి చెందిన వాగ్మారే గణేష్ (28), వాగ్మారే సంగ్రాం (35) ఇద్దరు అన్నదమ్ములు కౌడిపల్లిలో ఇటుక బట్టీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. సంగ్రాం పని నిమిత్తం తన స్వంత ఇంటికి నాగాల్ గావ్ వెళ్ళడంతో తమ్ముడు కౌడిపల్లి నుండి వెళ్లి అన్నతో పాటు మరో మిత్రుడు ముఖేడ్ గ్రామానికి చెందిన గైక్వాడ్ మదన్ ను తీసుకుని తన ద్విచక్రవాహనం ఎంహెచ్ 26 సీజే 0309 పై తిరుగు ప్రయాణం అయ్యారు.

గురువారం అర్ధరాత్రి జాతీయ రహదారి 161 నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లీ చౌరస్తా వద్ద రాగానే దారి తెలియక రాంగ్ రూట్ లో వెళ్లి ఎదురుగా హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న బొలెరో ఎంహెచ్ 44 యూ 2292 వాహనంను ఢీ కొన్నారు. దీంతో గణేష్, సంగ్రాం అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. మిత్రుడు మదన్ కు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కొరకు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు. మృతుడు గణేష్ భార్య రేణుక, సంగ్రాం భార్య ప్రియాంక ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed