వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు గల్లంతు

by Mahesh |
వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో వినాయక విగ్రహాల నిమజ్జనం లో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం బంగాళాఖాతంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడ్డారు. అనంతరం లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు యువకులు నీటిలో గల్లంతు అయినట్లు తెలుస్తుంది. వాకాడు మండలం తూపిలి పాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులు నాయడుపేట కావమ్మ గుడిసెంటర్‌కు చెందిన మునిరాజా, ఫయాజ్‌గా తెలిపగా.. మరో యువకుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed