బస్సును ఢీ కొట్టిన కారు ముగ్గురికి గాయాలు..

by Sumithra |
బస్సును ఢీ కొట్టిన కారు ముగ్గురికి గాయాలు..
X

దిశ, కొండపాక : కొండపాక శివారులో రాజీవ్ రహదారి పై ఆదివారం ఆర్టీసీ బస్సును కారు ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన పలువురు కొండపోచమ్మ దేవాలయానికి కారులో వెళ్తున్న క్రమంలో ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దాంతో కారులో ప్రయాణం చేస్తున్న నాగరాజు, నర్సింలు, లక్ష్మన్ లకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న టోల్ గేట్ అంబులెన్స్ సిబ్బంది పరశురాములు, రాకేష్ చేరుకొని వారికి ప్రథమ చికిత్స చేసే సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed