చెట్టుకు ఢీకొట్టిన కారు.. మహిళ మృతి

by Aamani |
చెట్టుకు ఢీకొట్టిన కారు.. మహిళ మృతి
X

దిశ,నవీపేట్: మండలంలోని జగ్గారావు ఫారం వద్ద కారు చెట్టుకు ఢీ కొట్టడంతో మహిళ ఘటన స్థలంలో మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు నిజామాబాద్ పట్టణం కోటగల్లి కి చెందిన కొందరు కారం పొడి కొరకు ఉదయం నిజామాబాద్ నుంచి ధర్మాబాద్ కు వెళ్లి కారం తీసుకుని తిరుగు ప్రయాణంలో వస్తున్నారు. జగ్గారావు ఫారం వద్ద ప్రమాదవశాత్తు కారు చెట్టుకు బలంగా ఢీ కొనడంతో కారు డ్రైవర్ సుదర్శన్ భార్య సులోచన అక్కడికక్కడే మృతి చెందగా, అనిత, సునీత, కవితకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్ పక్కనే పొలం పనులు చేస్తున్న కొందరు స్థానికులు 108 కి ఫోన్ చేయడంతో ఘటన స్థలానికి అంబులెన్సులు వచ్చి మృతదేహాన్ని, తీవ్ర గాయాలైన వారికి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed