- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చెరువులో పడి బాలుడు మృతి
by Disha Web Desk 15 |
X
దిశ ,దౌల్తాబాద్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన నితిన్ (10) బుధవారం దౌల్తాబాద్ వీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో పెళ్లికి వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులో ఈతకు అని వెళ్లి ప్రమాదవశాత్తు
చెరువులో మునిగి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని బయటకు తీస్తున్న క్రమంలో చెరువు కట్టపై కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని బాలుడు మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా చేశారు. శవ పరీక్ష నిమిత్తం గజ్వేల్ ప్రాంతీయ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఏఎస్ఐ సాయిలు తెలిపారు.
Next Story