జానంపేటలో కలకలం రేపుతున్న వరుస దొంగతనాలు

by Aamani |
జానంపేటలో కలకలం రేపుతున్న వరుస దొంగతనాలు
X

దిశ,శ్రీరంగాపూర్ : మండల పరిధిలోని జానంపేట గ్రామంలో ఊరు శివారులోని వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మూడు ఇండ్లలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం దొంగిలించారు. గౌని శ్రీరామ్ రెడ్డి ఇంట్లో రూ.ఒక లక్ష నలభై మూడు వేలు, ఎట్ల మాల వెంకటరెడ్డి ఇంట్లో రెండు తులాల బంగారం రూ,60000, ఎడ్ల మాల బాల్ రెడ్డి ఇంట్లో రూ. 50,000 దొంగతనం జరిగిందని బాధితులు ఎస్సై వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed