బెల్లంపల్లిలో రెచ్చిపోయిన దొంగలు

by Sridhar Babu |
బెల్లంపల్లిలో రెచ్చిపోయిన దొంగలు
X

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రధాన మార్కెట్లో దొంగతనం సంఘటన కలకలం రేపింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణం నడిబొడ్డున ఐదు దుకాణాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో పట్టణంలోని రెండు కిరాణ దుకాణాలు, పండిత్ మెడికల్ షాపు, తిలక్ ఫొటో స్టూడియో, బాలాజీ ఎలక్ట్రికల్ షాప్ లో తలుపులు పగలగొట్టి దొంగలు చొరబడ్డారు. మెయిన్ మార్కెట్లో ఏకకాలంలో ఐదు దుకాణాల్లో చోరీకి దిగడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ఈ సమయంలో పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడాన్ని అదునుగా చేసుకొని దొంగలు నిర్భయంగా దొంగతనానికి పూనుకున్నారు.

పట్టణ మెయిన్ రోడ్డులో ఈ సంఘటన చోటు చేసుకోవడం బెల్లంపల్లి వ్యాపార వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దుండగులు రూ. 85 వేల విలువైన 4 కెమెరాలు, రూ. 6 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులను సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనానికి పాల్పడింది ఇద్దరు వ్యక్తులేనని తేల్చారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య సందర్శించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరింది. ఈ మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed