రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

by Disha Web Desk 23 |
రోడ్డు ప్రమాదంలో  వ్యక్తి  మృతి..
X

దిశ,గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బైక్ ఢీకొన్న సంఘటన లో ఒకరి మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన కుంటం శివ కుమార్ , గడ్డం అశోక్ ఇద్దరు స్నేహితులు కలిసి బయ్యారం మండలం గరిమెళ్ల గ్రామం లో వివాహానికి హాజరై తిరిగి నర్సంపేట కు వస్తున్నారు.ఈ క్రమంలో గూడూరు మండలం మచ్చర్ల స్టేజి వద్ద నర్సంపేట నుంచి మహబూబాబాద్ కి వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో శివ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గడ్డం అశోక్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య జమున , కుమారుడు , కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నగేష్ తెలిపారు.


Next Story

Most Viewed