BIG BREAKING : రోడ్డు ప్రమాదంలో BRS కీలక నేత మృతి

by Disha Web Desk |
BIG BREAKING : రోడ్డు ప్రమాదంలో BRS కీలక నేత మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. అద్దంకి -నార్కట్‌పల్లి హైవేపై జరిగిన యాక్సిడెంట్‌లో బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సాధినేని జనార్ధన్ రావు(48) అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై టౌన్‌లోకి వస్తున్న ఆయన్ను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌ పైనుంచి ఎగిరి రోడ్డుకు అవతలి వైపు పడిపోయిన జనార్ధన్ రావు తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్‌లో ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదం రిక్షా పుల్లర్స్ కాలనీ సమీపంలో జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కాగా, జనార్ధన్ రావు బీఎస్ఎస్ పార్టీలో యాక్టీవ్‌గా పని చేస్తున్నారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరు పొందారు. అందరితో కలుపుగొలుపుగా ఉండే వ్యక్తి హఠత్మరణంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

Next Story

Most Viewed