- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మత్తు పనులను వేసవి సెలవులు ముగిసే లోపు పూర్తి చేయాలి : కలెక్టర్
దిశ,గద్వాల్ కలెక్టరేట్ : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అవసరమైన మరమ్మత్తు పనులను వేసవి సెలవులు ముగిసే లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీ ఎం. సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టాల్సిన నిర్మాణపు పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులన్నింటినీ గ్రౌండింగ్ చేసి మే 3వ తేదీ నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చేపట్టే పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు వారాంతపు నివేదికలను తప్పనిసరిగా అందజేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడే తెలియజేయాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో కమిటీలతో పాటు ప్రతి మండలానికి నోడల్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పాఠశాలల్లో అవసరం మేరకు తరగతి గదుల తాత్కాలిక మరమ్మత్తులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతుల కల్పన కొరకు పనులను చేపట్టి ఈ మాసం వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, డీఆర్డీఓ నర్సింగరావు, డీఈవో ఇందిర, ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.