మలేషియాలో అమానుష ఘటన.. వ్యక్తికి 702 ఏళ్ల జైలు శిక్ష..

by Vinod kumar |
మలేషియాలో అమానుష ఘటన.. వ్యక్తికి 702 ఏళ్ల జైలు శిక్ష..
X

కౌలాలంపూర్: మలేషియాలో అమానుష ఘటన జరిగింది. మైనారిటీ తీరని ఇద్దరు కూతుళ్లపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఈ దారుణానికి పాల్పడిన దుష్టుడికి అక్కడి కోర్టు 234 కొరడా దెబ్బలతో పాటు 702 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం 12, 15 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కూతుళ్లపై 2018-2013 మధ్య కాలంలో ఏకంగా 30 సార్లు అత్యాచారం చేసినట్లు 53 ఏళ్ల వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు. జోహార్ రాష్ట్రంలోని మువార్‌లో గల రెండు నివాసాల్లో ఈ దారుణం జరిగింది. తండ్రి వేధింపుల వల్ల ఒక కుమార్తె గర్భం కూడా దాల్చింది. చిన్నారులపై జీవితకాల గాయాన్ని కలిగించిన ఈ నేరం యొక్క తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కఠిన శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది.

తన చర్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన నిందితుడు తేలికైన శిక్ష విధించాలన్న విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. మలేషియాలో మైనర్లపై లైంగిక నేరానికి పాల్పడిన వారికి ఇలాంటి సుదీర్ఘ జైలు శిక్ష విధించడం సాధారణమే. మరో కేసులో 15 ఏళ్ల తన కుమార్తెపై మూడేళ్ల పాటు లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడికి 75 కొరడా దెబ్బలతో పాటు 218 ఏళ్ల జైలు శిక్ష విధించారు. భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో గల చిత్రకూట్‌లో మద్యం మత్తులో 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన 38 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed