చంపాపేట ప్రధాన రోడ్డుపై లారీ బీభత్సం

by Disha Web Desk 15 |
చంపాపేట ప్రధాన రోడ్డుపై లారీ బీభత్సం
X

దిశ, చంపాపేట్ : చంపాపేట ప్రధాన రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యసంగా వెలుగులోకి వచ్చింది. బైక్ ను ఢీకొట్టి రెండు కిలో మీటర్ల మేర నెట్టుకుంటూ వెళ్లింది. అనంతరం మరో కారును ఢీకొట్టి వెళ్లి పోయింది. బైక్ యజమాని ఫిర్యాదు మేరకు ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈదీబజార్ కు చెందిన వ్యాపారి మొహమ్మద్ అబ్దుల్ మజీద్ (60 ) ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి తన ద్విచక్ర వాహనంపై చంపాపేట్

లక్ష్మీ గార్డెన్ దగ్గరకు వెళుతుండగా వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దాంతో మజీద్ రహదారికి ఎడమ వైపున పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ అతని ద్విచక్ర వాహనాన్ని లారీ కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం చంపాపేట్ టి-జంక్షన్ వద్ద అదే లారీ మరో కారును కూడా ఢీకొట్టి ధ్వంసం చేసి ఆగకుండా వెళ్లి పోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Next Story

Most Viewed