అధికారుల వేధింపులతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

by Disha Web Desk 23 |
అధికారుల వేధింపులతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
X

దిశ,యాలాల : వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాండూర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ రాజప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి యాలాల మండలం దౌలాపూర్ లో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story