పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

by Disha Web Desk 15 |
పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
X

దిశ,కల్లూరు : పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరు పట్టణానికి చెందిన చల్ల నరసింహారావు ( 45) హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణానికి చెందిన చల్లా నరసింహారావు పుష్పావతి ఇరువురూ భార్యాభర్తలు. ఇద్దరి మధ్య చిన్నపాటి

గొడవలు రావడంతో క్షణికావేశంలో ఈనెల 16వ తేదీన ఇరువురూ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య సంఘటనా స్థలంలోని మృతిచెందగా భర్తను కల్లూరులో ప్రాథమిక వైద్యం అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్​లో వైద్య సేవలు అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్కే షాకీర్ కేసు నమోదు చేశారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Next Story

Most Viewed