ఖలీల్ మృతితో అంతంపేటలో విషాదఛాయలు

by Disha Web Desk 11 |
ఖలీల్ మృతితో అంతంపేటలో విషాదఛాయలు
X

దిశ, మర్రిగూడ: శివన్నగూడ రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి మృత్యువాత పడిన బాలుడు మహమ్మద్ ఖలీల్ మృతితో అంతంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం సాయంత్రం శివన్నగూడ రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి మహమ్మద్ ఖలీల్ నీటిలో గల్లంతైన విషయం పాఠకులకు విదితమే. ఖలీల్ కోసం ఈతగాళ్లు రాత్రి వరకు వెతికిన కనిపించకపోవడంతో గురువారం ఉదయం 20 మంది ఈతగాళ్లు వెతికి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువెళ్లగా అంతంపేట లో తల్లిదండ్రుల రోధనలు గ్రామస్తులను కన్నీరు పెట్టించింది. దీంతో అంతంపేట శోకసంద్రంలో మునిగింది.



Next Story

Most Viewed