- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
దిశ, జక్రాన్ పల్లి: మద్యం మత్తులో భార్యను భర్త చంపిన ఘటన మండలంలోని నూర్ సింగ్ తాండలో చోటు చేసుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం విలేఖరులతో డిచ్ పల్లి సీఐ మల్లేష్ మాట్లాడుతూ నూర్ సింగ్ తండాకు చెందిన వివాహిత మృతురాలు కేలోత్ సరితకు దాదాపు 20 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన కేలోత్ శ్రీనివాస్ (సుధాకర్) అను వ్యక్తితో వివాహం జరగింది. ఆమె భర్త శ్రీనివాస్ మద్యానికి బానిస అయి తరుచుగా భార్యతో గొడవ పడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ అరచు కొడుతూ ఉండేవాడు.
ఈ నెల 1వ తేదీ రోజు మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఇంటికి వచ్చిన ఆమె భర్త మృతురాలిని ఏదో ఒక గొడవ పెట్టుకొని ఆ గొడవలో ఎలాగైనా చంపాలని అనుకుని పథకం ప్రకారం అదే రోజు సాయంత్రం ఇంట్లోలేని సమయములో మృతురాలి తో గొడవ పడి చేతులతో ముఖం పైన పిడి గుద్దులు గుద్ది ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమె తలపైన ఇతర చోట్ల విపరీతంగా కొట్టగా మృతురాలు అక్కడికక్కడే చనిపోయింది. ఇట్టి సంఘటన విషయంలో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంబించి నిందితుడు అయిన కేలోత్ శ్రీనివాస్ ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిచ్ పల్లి సీఐ మల్లేష్ పేర్కొన్నారు.