విద్యుత్ షాక్ తో రైతు మృతి..

by Sumithra |
విద్యుత్ షాక్ తో రైతు మృతి..
X

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన అమర్ల బండ దేవేందర్ రావు అలియాస్ రాజు (35) బుధవారం ఉదయం తన సొంత పొలంలో పత్తి పంటకు పురుగుల మందు కొడదామని వెళ్లారు. కాగా అక్కడ ట్రాన్స్ఫార్మర్ కు ఉన్న వైరు ఊడిపోవడంతో దాన్ని కట్టెతో సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు చేతులకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు, ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు,ఒ క కుమారుడు ఉన్నాడని పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed