భార్యను హత్య చేసిన కసాయి భర్త రిమాండ్​

by Disha Web Desk 15 |
భార్యను హత్య చేసిన కసాయి భర్త రిమాండ్​
X

దిశ, గాంధారి : భార్యను హత్య చేసిన కసాయి భర్త నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి సీఐ సంతోష్ కుమార్ ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ గత ఆదివారం బ్రిడ్జి సమీపంలో గల బావిలో గుర్తుతెలియని మహిళ శవం లభించింది. శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా పూర్తి వివరాలు రావడంతో గాంధారికి చెందిన బుర్రి కీర్తనగా గుర్తించినట్టు తెలిపారు. కీర్తన స్వగ్రామం లింగంపేట్ మండలం కోర్పుల్ గ్రామం అని, తొమ్మిది నెలల క్రితం గాంధారి కి చెందిన బుర్రి విజయ్​తో వివాహం అయినట్టు తెలిపారు.

భార్యభర్తలు పెళ్లైన కొన్నాళ్లకే బంధువులకు దూరంగా ఉంటూ జీవనం సాగించేవారు. తరచుగా వాళ్ల కాపురంలో గొడవలు జరుగుతూ ఉండేవి. అలాగే విజయ్ కుమార్ భార్యపై అనుమానం పెంచుకొని ఎలాగైనా తన భార్య కీర్తనను హత్య చేయాలని నెల క్రితం మరొక వ్యక్తి సహాయంతో విజయ్ కుమార్ కిరాయికి ఉంటున్న ఇంటికి రమ్మని కీర్తనను పిలిపించాడు. అనంతరం గొంతుకు టవల్తో ఉరివేసి చంపి వేశాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా గోనెసంచిలో కట్టి దానిపైన ప్లాస్టిక్ కవర్ తో కట్టి బ్రిడ్జి సమీపంలో గల బావిలో పడేశాడు.

దీంతో నూత్రానికి దగ్గర బంధువులు ఎవరూ లేకపోవడంతో ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. అయితే మూడు రోజుల క్రితం రక్తసంబంధికుల బలవంతం మేరకు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా నమోదు చేశానని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. పోలీసులకు భర్త పైన అనుమానం ఉండడంతో బావిలో వెతికి చూడగా కుళ్లిన స్థితిలో ఉన్న శవం లభించిదని తెలిపారు. మంగళవారం నిందితులు నేరం ఒప్పుకోవడంతో జ్యూడీషియల్ రిమాండ్​కు పంపినట్టు తెలిపారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్ఐని, పోలీస్ సిబ్బందిని సీఐ సంతోష్ కుమార్ అభినందించారు.

Next Story