- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మురికి కాలువలో ఆడ శిశువు మృతదేహం లభ్యం..
దిశ,హుజురాబాద్ రూరల్: గుర్తుతెలియని అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్ల పక్కన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ...శుక్రవారం హుజురాబాద్ పట్టణ ఆర్టీసీ బస్టాండ్ మరుగుదొడ్ల పక్కన మురికి కాలువ చెత్త కుప్ప చాటున మహిళ శిశువు మృతదేహం కనిపించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అటు పక్కన వెళుతున్న కొందరు అప్పుడే పుట్టి మృతి చెందిన ఆడ శిశువును గమనించారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు గుర్తించారు.
వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని శిశువు మృతదేహాన్ని పరిశీలించి ఘటన స్థలం వద్ద వివరాలు సేకరించారు. శిశువు మృతదేహం ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఇక్కడ పడవేశారా..?ఆడపిల్లని ఆ తల్లి బంధం తెంచుకుందా.. అక్రమ సంతానమా.. అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. శిశువు మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.