దారుణం.. కొడవలితో కన్నతల్లిని పొడిచి చంపిన తనయుడు

by Aamani |
దారుణం.. కొడవలితో కన్నతల్లిని పొడిచి చంపిన తనయుడు
X

దిశ,లోకేశ్వరం: కన్న కొడుకు చేతిలోనే తల్లి దారుణ హత్యకు గురైన సంఘటన లోకేశ్వరం మండలంలో సోమవారం జరిగింది. లోకేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని లక్ష్మీ నగర్ తండాలో తల్లి లౌడియా ఇందిరా బాయి (60) ను ఆమె కన్న కొడుకు రాయబాబు కొడవలితో పొడిచి హత్య చేశాడు. గత కొద్ది రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని సోమవారం ఉదయం కూడా తల్లి కొడుకుల ఇద్దరు గొడవపడగా వెంటనే కొడవలితో తల్లిని కడుపులో పొడవుగా సంఘటన స్థలంలోనే ఇందిరా బాయి మృతి చెందిందని తెలిపారు. సంఘటన స్థలాన్ని బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేష్, ఏఎస్ ఐ దిగంబర్ లు సందర్శించి వివరాలు సేకరించారు.

Advertisement

Next Story