హాస్టల్లోని పిల్లలను చూసేందుకు వెళ్లి మృత్యువాత

by Sridhar Babu |
హాస్టల్లోని పిల్లలను చూసేందుకు వెళ్లి మృత్యువాత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : హాస్టల్లో చదువుకుంటున్న తమ పిల్లలను చూసేందుకు వెళ్లి మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటన నిజామాబాద్ ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ ఎన్ ఫంక్షన్ హాల్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మ్యాతరి సంగీత (45) అనే మహిళ మృతి చెందింది.

నిజామాబాద్ నగరంలోని ఓ విద్యా సంస్థకు చెందిన హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న తమ పిల్లలను కలిసేందుకు సంగీత తన భర్తతో కలిసి మోటార్ బైక్ పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఎన్ ఎన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ దగ్గరకు రాగానే నిజామాబాద్ వైపు నుండి వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వీరి బైక్ ను ఢీకొనడంతో సంగీత అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆరవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed