నటుడు రఘుబాబు అరెస్ట్.. రెండు గంటల్లోనే బెయిల్

by Disha Web Desk 2 |
నటుడు రఘుబాబు అరెస్ట్.. రెండు గంటల్లోనే బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమై పోలీసులు అదుపులో ఉన్న టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రఘుబాబుకు బెయిల్ మంజూరు అయింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదైంది. దీంతో నల్గొండ రెండో పట్టణ పోలీసులు రఘుబాబుని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వస్తోన్న రఘుబాబు వాహనం నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి రాగానే.. బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Next Story

Most Viewed