ఫోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

by Sridhar Babu |
ఫోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
X

దిశ, జహీరాబాద్ : అత్యాచారం కేసులో నేరస్తునికి ఫోక్సో ప్రత్యేక కోర్టు సంగారెడ్డి జడ్జి జీవిత కాల శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ఈ సంఘటనలో మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన టైల్స్ పని చేసుకునే మహమ్మద్ జాబార్ (19)కు జైలు శిక్ష తో పాటు నగదు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2018 సంవత్సరంలో ఒక మూగ మైనర్ బాలికపై నేరస్తుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను పరిశీలించి, వాదోపవాదనలు విన్న తరువాత నేరం రుజువైనందున జీవిత కాల శిక్షతో పాటు రూ.20 వేల నగదు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని జహీరాబాద్ డీఎస్పీ కె.రామ్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story