నీటిలో మునిగి యువకుడు మృతి..

by Sumithra |
నీటిలో మునిగి యువకుడు మృతి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో ఆదివారం యువకుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. నాగారంకు చెందిన షేక్ అక్బర్ (26) తన స్నేహితులతో కలిసి సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీట మునగడంతో మృతి చెందాడు. స్థానిక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) కు తరలించారు.

Next Story