రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Disha Web Desk 15 |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, దుండిగల్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే మెదక్ జిల్లా గుమ్మడిదల మండలం దోమగుడి గ్రామానికి చెందిన పితా ఆది(19)సొంత గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఏడాది క్రితం రమ్యశ్రీ తో వివాహం అయింది.

శనివారం గాజులరామారంలోని ఆటో మెకానిక్ షాప్ కు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. సూరారంలోని జ్యోతి మిల్క్ సెంటర్​ దగ్గరకు రాగానే వెనక నుండి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేరుకున్న పోలీస్ లు దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ వెంకటేశం తెలిపారు.



Next Story

Most Viewed