ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

by Sumithra |
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
X

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగునూరులో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సుమారు అర్థరాత్రి 12 గంటల సమయంలో కరీంనగర్ సాయినగర్ కు చెందిన తాటికొండ రమేష్ తన షాపు ముగించుకుని కరీంనగర్ వస్తుండగా రోడ్డు పై ఆగి ఉన్న లారిని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రమేష్ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే చొప్పదండిలో బుక్ స్టాల్ నిర్వహిస్తున్న రమేష్ బుధవారం వర్షం పడటంతో రాత్రి 11 గంటలు దాటాక పని ముగించుకుని కరీంనగర్ వైపు వస్తున్న వ్యాగనార్ కారు ఏపీ 10 ఏవై 3562 లో వస్తున్న తాటికొండ రమేష్ 50 సంవత్సరాలు ఆగి ఉన్న లారీ నంబర్ టీఎస్ 01 యూసీ 0257 ఢీ కొనగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీన పరచుకొని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే లారీ డ్రైవర్ అజాగ్రత్తతో రోడ్డుపై లారీ నిలిపివేసి ఎటువంటి పార్కింగ్ లైట్లు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు.



Next Story