ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి

by Sridhar Babu |
ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, పరిగి : ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పరిగి ఎస్​ఐ సంతోష్​ తెలిపిన వివరాల ప్రకారం కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడెం తాలుకాకు చెందిన కాణగడ్డ గ్రామానికి చెందిన చాకలి రాజు (35) అనే వ్యక్తి తన భార్య సునిత, ముగ్గురు పిల్లలతో కలిసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ సమీపంలో మేస్త్రి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బైక్​ ఫైనాన్స్​ కట్టి వస్తానని మంగళవారం ఉదయం బయలుదేరాడు. ఫైనాన్స్​ కట్టి తిరిగి వస్తూ పరిగి మండలం చింతల్​ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలైన చాకలి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్​ఐ సంతోష్​ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed