Road Accident:లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

by Jakkula Mamatha |
Road Accident:లారీ ఢీకొని  వ్యక్తి దుర్మరణం
X

దిశ,ఆదోని: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ సమీపంలో వ్యక్తి పై లారీ దూసుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కలుబావి ప్రకాష్ నగర్ ఎస్సీ కాలనీకి చెందిన గిడ్డయ్య గురువారం బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా అదే సమయంలో బళ్లారి నుంచి ఆదోనికి వైపు వస్తున్న ట్యాంకర్ (లారీ) రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోతుండగా డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య సరోజమ్మ నలుగురు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని కోల్పోవడంతో భార్య పిల్లలు కన్నీటి మున్నీరుగా విలపించారు.

Advertisement

Next Story

Most Viewed