- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేజీ 380 గ్రాముల గంజాయి స్వాధీనం
దిశ, మధిర : మధిర పట్టణంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను మధిర టౌన్ ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక కేజీ 380 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, దాని విలువ రూ.27,600 ఉంటుందని మధిర సీఐ డి. మధు వెల్లడించారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నందిగామ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న మైలవరంనకు చెందిన షేక్ జాఫర్, తమ్మిశెట్టి నరసింహారావులు
పోలీసులను చూసి పారిపోతుండగా వారిని పట్టుకొని విచారించారు. దాంతో వారి వద్ద గంజాయి దొరికినట్లు తెలిపారు. వీరికి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మధు ద్వారా మైలవరానికి చెందిన శివ వద్దకు గంజాయి సరఫరా అవుతుందని సీఐ తెలిపారు. శివ వద్ద నుండి కొనుగోలు చేసిన జాఫర్, నరసింహారావు వివిధ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయి అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన మధిర పట్టణ ఎస్ఐ ఎన్.సంధ్య , హెడ్ కానిస్టేబుల్ ఆర్. ప్రకాష్ రావు ,హోంగార్డు లు విజయబాబు, మురళీకృష్ణ లను సీఐ మధు అభినందించారు.