కామాందుడికి బలైన బాలిక

by Sridhar Babu |   ( Updated:2024-07-06 09:04:00.0  )
కామాందుడికి బలైన బాలిక
X

దిశ, సైదాపూర్ : కామాందుడికి ఓ బాలిక బలైంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక పాపకు జన్మనిచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదివి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో వినాయక చవితి పండుగకు ఇంటికి వచ్చినప్పుడు అదే గ్రామానికి చెందిన వరుసకు బావ అయినటువంటి రెడ్డి వెంకటేష్ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆదర్శ పాఠశాల హాస్టల్లో ఉంటున్న

బాలిక మూడు నెలల క్రితం వాంతులు చేసుకోవడం ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చిన విషయం బయటపడింది. బాలికను తల్లిదండ్రులు అడగడంతో వెంకటేష్ వల్లనేనని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు వెళ్లి వెంకటేష్​ను తన కూతురిని వివాహం చేసుకోవాలని అడుగుతూ వస్తున్నారు. ఇంతలో ఆ బాలిక ఈ నెల 1న, హన్మకొండ ఓ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. కాగా బాలిక తల్లి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై జన్ను ఆరోగ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed